కరోనా నియంత్రణ చర్యలపై కరీంనగర్ కలెక్టర్ సమీక్ష
శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక.. నగర సీపీ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఉన్న అనుమానితులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తు్న్నట్లు చెప్పారు. అనుమానితులను హైదరాబాద్ తీసుకెళ్ళెందుకు వాహానాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షలకు తీసుకువచ్చే అనుమానితుల సెల్ ఫోన్ నెంబర్లు, వారి చిరునామాలను రికార్డు చేయాలని సూచించారు.